Friday, 1 November 2013

ప్రస్తుతం ప్రజ్జ్వలిస్తున్న సమస్య,వేర్పాటు ,సమైక్య సమస్య.లోకోభిన్నరుచి" అన్నట్లు ఎవరెవరి అభిప్రాయలు వేరు వేరుగా ఉండడటం సహజం.కాని గతంలో జరిగిన రాష్ట్రాల వేర్పాట్ల తతంగాలను పరిశీలిస్తే,వేర్పాటును కా 'క్షించే వారే విడిపోయి,తమ రాజధానిని ఏర్పాటు చేసుకోవడమైంది.ఉమ్మడిమద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రులు విడిపోయి తమ రాజధానిని ఏర్పాటు చేసుకొన్నారు.అలాగే గుజరాతీయులు కూడా.ఈవిషయాలను   దృష్టిలో పెట్టుకొని తెలంగాణా సోదరులు కలిసి ఉండడం తమకిష్టం లేకపోతే విడిపోయి తమరాజధానిని తామే ఏర్పాటు చేసుకొని అన్నదమ్ములా మెలగటం ధర్మం,మరియు సర్వామోదం.

ఆధునిక సాహిత్యకారుల మనస్తత్వాలు

ఆధునిక సాహిత్యకారుల మనస్తత్వాలను నిష్పాక్షికంగా పరిశీలించినట్లైతే రెండు విషయాలు స్పష్టంగా బోధపడుతాయి.
1. ప్రభుత్వ పథకాలను పరిశీలించి వాటికనుగుణంగా తమకిష్టమున్నా లేకున్నా తదనుగుణంగా సాహిత్య సృష్టి చేసి,అవార్డులు పొందడం.
2. అవార్డులతో నిమిత్తం లేకుండా, సమాజశ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, ప్రజలలో చైతన్యం కలిగించే దిశగా రచనలు కొనసాగించటం.
అయితే,సమాజంలో పై రెండో కోవకు చెందిన సాహిత్యాన్ని సామాన్య ప్రజలు అర్థం చేసుకోలేరు. దాంతో సమాజంలో చవకబారు సహిత్యం, అశ్లీల, అసభ్యకర సినిమాలు, దూరదర్శన కార్యక్రమాలు విజృంభిస్తున్నాయి. వాటి ప్రభావంతో వెర్రితలలు వేస్తున్న యువకుల వికృత వికార చేష్టలు సభ్యసమాజానికి తలవంపులు తెస్తున్నాయి.

Thursday, 19 September 2013

ఆముక్తమాల్యద

పంచకావ్యాలలో  నాకు ఆముక్తమాల్యద చాల యిష్ట మైనది.